ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం (వాటి వెనుక ఉండే) సంకల...
దృఢమైనది
ముత్తఫిఖ్ అలైహి

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు – ఆచరణలు అన్నీ వాటి వెనుక ఉండే సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. ఈ నియమం సాధారణంగా ఆచరణలు అన్ని...
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా మా ఈ విషయములో (ఇస్లాంలో), దానికి చెందని ఏదైనా విషయాన్ని...
దృఢమైనది
ముత్తఫిఖ్ అలైహి

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: ఎవరైనా ఈ ధర్మములో (ఇస్లాంలో) ఏదైనా కొత్త విషయాన్ని సృష్టించినట్లయితే, లేదా ఖుర్’ఆన్ మరియ...
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ఒకరోజు మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉండగా, స్వచ్ఛమైన తెల్లటి వస్త్రాలు ధరించి,...
దృఢమైనది
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇలా తెలియ జేస్తున్నారు – జిబ్రయీల్ అలైహిస్సలాం సహబాల వద్దకు ఎవరో తెలియని ఒక మనిషి రూపంలో వచ్చారు. స్వచ్ఛమైన అతి త...
అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఇస్లాం (మూ...
దృఢమైనది
ముత్తఫిఖ్ అలైహి

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాంను ఒక పటిష్టమైన నిర్మాణంతో పోల్చారు, దాని ఐదు స్తంభాలు ఆ నిర్మాణానికి బలాన్ని, ఆధారాన్ని చేకూరుస్తాయి. ఇస్లాం...
ము’ఆద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక ఒక గాడిద పై కూర్చుని ఉన్నాను. ఆ గాడిద పేరు ‘ఉఫెయిర్’. ప్రవక్త సల...
దృఢమైనది
ముత్తఫిఖ్ అలైహి

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాసులపై అల్లాహ్ యొక్కహక్కు మరియు అల్లాహ్ పై దాసుల యొక్క హక్కును గురించి వివరిస్తున్నారు. దాసులపై అల్లాహ్ యొక...

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు – ఆచరణలు అన్నీ వాటి వెనుక ఉండే సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. ఈ నియమం సాధారణంగా ఆచరణలు అన్నింటికీ వర్తిస్తుంది – అవి ఆరాధనలకు సంబంధించిన ఆచరణలు గానీ లేక సాధారణ వ్యవహారాలకు సంబంధించిన ఆచరణలు గానీ. కనుక ఎవరైనా తాను చేసే పని ద్వారా ఏదైనా ప్రయోజనం లేదా లాభం పొందాలని సంకల్పించి ఉంటే, అతనికి ఆ ప్రయోజనం తప్ప పుణ్యఫలం ఏమీ లభించదు. అలాగే ఎవరైనా తాను చేసే పని కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క సామీప్యం పొందే, ఆయన కరుణ పొందే సంకల్పము తో చేసి ఉంటే, అతనికి దాని ప్రతిఫలం మరియు పుణ్యఫలం లభిస్తాయి, అది తినడం లేక తాగడం లాంటి సాధారణ ఆచరణ అయినా సరే. ఆచరణలలో ‘సంకల్పము’ యొక్క ప్రాధాన్యత మరియు దాని ప్రభావాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ ద్వారా విశదీకరిస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల ‘హిజ్రత్’ (తన స్వస్థలాన్ని వదిలి శాస్వతంగా వేరే కొత్త ప్రదేశానికి వలస వెళ్ళుట) బాహ్యంగా చూడడానికి ఒకేలా కనిపించినా – ఎవరైతే కేవలం తన ప్రభువైన అల్లాహ్ యొక్క సంతుష్ఠి కొరకు, ఆయన సామీప్యం మరియు కరుణ పొందుటకు వలస వెళ్ళిపోవాలని సంకల్పిస్తాడో, అది షరియత్’కు అనుగుణంగా చేయబడిన ‘హిజ్రత్’ (వలస) గా స్వీకరించబడుతుంది. అతని సంకల్పములోని స్వచ్ఛత కారణంగా అతడికి పుణ్యఫలం లభిస్తుంది. అలాగే, ఎవరైతే తాను చేసే హిజ్రత్ (వలస వెళ్ళిపోవుట) ద్వారా ఏదైనా ప్రాపంచిక ప్రయోజనం పొందుట సంకల్పించి ఉంటే, అంటే ఉదాహరణకు ధనం సంపాదించుట కొరకు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుట కొరకు, లేదా వ్యాపారం కొరకు, లేదా ఆ ప్రదేశపు స్త్రీని వివామాడుట కొరకు సంకల్పించి ఉంటే, అతడికి అతడు ఆశించిన ప్రయోజనం తప్ప మరేమీ లబించదు. హిజ్రత్ పుణ్యఫలంలో అతడికి ఏమాత్రమూ భాగం ఉండదు.
Hadeeth details

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: ఎవరైనా ఈ ధర్మములో (ఇస్లాంలో) ఏదైనా కొత్త విషయాన్ని సృష్టించినట్లయితే, లేదా ఖుర్’ఆన్ మరియు సున్నత్’లలో ప్రామాణికము లేని ఏదైనా ఆచరణను ఆచరించినా, అది ఈ ధర్మము యొక్క యజమాని (అల్లాహ్) చే తిరస్కరించబడుతుంది, మరియు ఆయన వద్ద (అల్లాహ్ వద్ద) అది ఆమోదయోగ్యము కాదు.
Hadeeth details

ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇలా తెలియ జేస్తున్నారు – జిబ్రయీల్ అలైహిస్సలాం సహబాల వద్దకు ఎవరో తెలియని ఒక మనిషి రూపంలో వచ్చారు. స్వచ్ఛమైన అతి తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారని, ఆయన తల వెంట్రుకలు నిగనిగలాడుతూ అతి నల్లగా ఉన్నాయని, సుదూర ప్రయాణికుడు అనడానికి అతనిలో అలసట, వొంటిపై దుమ్ము, చెదిరిన వెంట్రుకలు, బట్టలపై ధూళి వంటి చాయలేవీ లేవు అని అతడి రూపురేఖలను గురించి వివరించినారు. తామందరూ అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉన్నామని, తమలో ఎవరూ అతడిని ఎరుగరు అని అన్నారు. అతడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఎప్పటి నుంచో ఎరిగిన వానిలా, ఆయన ముందు కూర్చుని ఇస్లాం ను గురించి ప్రశ్నించినాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘షహాదతైన్’, సలాహ్ ను స్థాపించుట, జకాతు చెల్లించుట, రమజాన్ నెల ఉపవాసములు మరియు స్థోమత కలిగి ఉంటే హజ్ చేయుట మొదలైన వాటితో కూడిన ఇస్లాం మూల స్తంభములను గురించి చెప్పినారు. ఆ ప్రశ్నించిన వ్యక్తి “నీవు సత్యము చెప్పినావు” అన్నాడు. సహబాలందరూ ఆశ్చర్య పోయినారు – పైకి ఏమీ ఎరుగని వాడిలా ప్రశ్నిస్తాడు, తరువాత దానిని ధృవీకరిస్తాడు – అని. తరువాత అతడు ఈమాన్ గురించి ప్రశ్నించినాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈమాన్ యొక్క ఆరు మూల స్తంభములను గురించి వివరించినారు. అందులో అల్లాహ్ యొక్క ఉనికిని విశ్వసించుట, ఆయన గుణగణములను విశ్వసించుట, ఆయన కార్యములలో ఆయన ఏకైకుడని (ఆయనకు సాటి, సహాయకులు ఎవరూ లేరని) విశ్వసించుట, ఉదాహరణకు సృష్టి; ఆరాధనలు అన్నింటికీ ఆయన మాత్రమే ఏకైక అర్హుడని విశ్వసించుట. మరియు దైవదూతలను అల్లాహ్ కాంతితో సృష్టించినాడని, వారు అల్లాహ్ యొక్క గౌరవనీయులైన దాసులని, ఎప్పుడూ అల్లాహ్ పట్ల అవిధేయులు కారు అని, అల్లాహ్ యొక్క ఆఙ్ఞలకు అనుగుణంగా ఆచరిస్తారని విశ్వసించుట, అల్లాహ్ తరఫు నుండి ఆయన సందేశహరులపై అవతరింప జేయబడిన గ్రంథములను విశ్వసించుట, ఉదాహరణకు ఖుర్’ఆన్, తౌరాత్ మరియు ఇంజీలు మొదలైనవి, మరియు ఆయన సందేశహరులను విశ్వసించుట, ఎవరైతే అల్లాహ్ తరఫున ఆయన ధర్మాన్ని వ్యాపింప జేసినారో; వారిలో నూహ్, మూసా మరియు ఈసా అలైహిముస్సలాం మొదలైన మిగతా సందేశహరులు, ప్రవక్తలు ఉన్నారని, వారిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లహ్ యొక్క చిట్టచివరి సందేశహరుడు అని విశ్వసించుట మరియు అంతిమ దినము నందు విశ్వసించుట – ఇందులో మరణానంతరం సమాధి నుండి మొదలుకుని ‘అల్ బర్జఖ్’ యొక్క జీవితం వరకు (మరణానికీ తీర్పు దినమునకు మధ్య ఉండే సంధి కాలపు జీవితం), మరియు మనిషి మరణానంతరం తిరిగి లేప బడతాడు అని, అతడి ఆచరణల లెక్క తీసుకో బడుతుంది అని, చివరికి అతడి అంతిమ నివాస స్థానము స్వర్గము గానీ లేక నరకము గానీ అవుతుంది అని విశ్వసించుట, తన అనంతమైన ఙ్ఞానము, వివేకముల ఆధారంగా అల్లాహ్ (ప్రళయ దినము వరకు) జరుగబోయే ప్రతి విషయాన్ని గురించి ముందుగానే రాసి ఉంచినాడని, జరిగే ప్రతి విషయమూ, అది ఎందుకొరకు సృష్టించబడినదో ఆ లక్ష్యము కొరకు జరుగుతుందని మరియు ఆయన ముందుగానే రాసి ఉంచిన దాని ప్రకారమే జరుగుతుందని విశ్వసించుట. తరువాత ఆవ్యక్తి ‘అల్ ఇహ్’సాన్’ ని గురించి తెలుపమని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసారు – అల్ ఇహ్’సాన్ అంటే అల్లాహ్ ను మన ఎదురుగా చూస్తూ ఉన్నట్లుగా ఆయనను ఆరాధించుట. ఆరాధనలో ఆ స్థాయిని చేరుకోలేక పోయినట్లయితే, అల్లాహ్ తనను చూస్తున్నాడని గ్రహించుట. వీటిలో మొదటిది (అల్లాహ్ ను మన ఎదురుగా చూస్తున్నట్లుగా ఆయనను ఆరాధించుట) అత్యుత్తమ స్థాయి, రెండవ స్థాయి అల్లాహ్ మనల్ని చూస్తున్నాడనే , స్పృహ కలిగి ఉండుట. తరువాత అతడు ‘ప్రళయ ఘడియ ఎపుడు?’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ప్రళయ ఘడియకు చెందిన ఙ్ఞానమును అల్లాహ్ తన ఙ్ఞానములో భద్రపరిచి ఉంచాడు. కనుక సృష్టితాలలో ఎవరూ దానిని గురించి ఎరుగరు, చివరికి ప్రశ్నించ బడుతున్నవాడు మరియు ప్రశ్నించే వాడు కూడా” అని వివరించారు. తరువాత అతడు ‘కనీసం ప్రళయ ఘడియ సంకేతాలైనా చెప్పమని’ అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - ఉంపుడు గత్తెలు విపరీతంగా పెరిగి పోవడం, ఆ కారణంగా వారి సంతానం పెరిగి పోవడం, లేదా తల్లుల పట్ల సంతానం యొక్క అవిధేయత విపరీతంగా పెరిగిపోవడం, వారు తమ సేవకులు, బానిసలు అన్నట్లుగా వ్యవహరించడం, అలాగే యుగాంతము సమీపిస్తున్న కాలములో పశువుల కాపరులకు, నిరుపేదలకు సైతము ఈ ప్రపంచ సుఖాలను సాధించుట తేలికై పోతుంది, వారు పెద్దపెద్ద భవనాలను నిర్మించడంలో ఆర్భాటము, అట్టహాసము ప్రదర్శిస్తుంటారు – అని వీటిని ‘ప్రళయ ఘడియ’ సమీపిస్తున్నది అనడానికి కొన్ని సంకేతాలుగా వివరించినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నలు అడిగిన ఆ వ్యక్తి జిబ్రయీల్ అలైహిస్సలాం అని, సహబాలకు ఈ ‘దీన్ అల్ హనీఫా’ (స్వచ్ఛమైన ధర్మము) ను గురించి తెలియజేయడానికి వచ్చినారు అని తెలియ జేసినారు.
Hadeeth details

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాంను ఒక పటిష్టమైన నిర్మాణంతో పోల్చారు, దాని ఐదు స్తంభాలు ఆ నిర్మాణానికి బలాన్ని, ఆధారాన్ని చేకూరుస్తాయి. ఇస్లాం యొక్క మిగతా విషయాలు ఆ నిర్మాణాన్ని పరిపూర్ణం చేస్తాయి. ఈ మూలస్తంభాలలో మొదటిది: “షహాదతైన్” (రెండు సాక్ష్యాపు వాక్యాలు ఉచ్చరించుట). “అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడు ఎవరూ లేరు” అని సాక్ష్యము పలుకుట, మరియు “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క సందేశహరుడు” అని సాక్ష్యం పలుకుట. ఈ రెండూ కలిసి ఒకే మూలస్తంభము; ఇవి ఒకదాని నుండి మరొకటి విడదీయరానివి. దాసుడు ఈ సాక్ష్యపు వాక్యాలు ఉచ్చరిస్తాడు, తద్వారా అతడు అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని, మరియు కేవలం ఆయన మాత్రమే ఆరాధనలకు నిజమైన అర్హుడని, ఆయన తప్ప మరింకెవ్వరూ అర్హులు కారని గుర్తిస్తున్నాడు మరియు అంగీకరిస్తున్నాడు అన్నమాట. అదేవిధంగా అతడు, తాను ఉచ్చరించిన సాక్ష్యాపు వాక్యాలకు అనుగుణంగా ఆచరిస్తాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశాన్ని విశ్వసిస్తాడు మరియు ఆయనను అనుసరిస్తాడు. మూలస్తంభాలలో రెండవది: సలాహ్’ను స్థాపించుట. అంటే దినము మరియు రాత్రిలో విధిగా ఆచరించవలసిన ఐదు పూటల నమాజులను, వాటి నిర్ధారిత వేళల్లో, వాటికి సంబంధించిన నియమాలు, విధులు మరియు విధానాలను అనుసరిస్తూ ఆచరించుట; ఈ ఐదు: ఫజ్ర్, జుహ్ర్, అస్ర్, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు. మూడవ మూలస్థంభము: జకాతును విధిగా చెల్లించుట. ఇది ఒక ఆర్థికపరమైన ఆరాధన. షరియత్ లో నిర్ధారించబడిన ఒక స్థాయికి చేరిన సంపదపై జకాతు చెల్లించుట విధి. మరియు అట్టి జకాతు దానికి తగిన అర్హులకు ఇవ్వబడుతుంది. నాలుగ మూలస్థంభము: “హజ్జ్”. అల్లాహ్ యొక్క ఆరాధనలో భాగంగా మక్కా నగరంలోని కాబా గృహాన్ని దర్శించి అక్కడ దానికి సంబంధించిన విధి,విధానాలను ఆచరించడాన్ని “హజ్జ్” అంటారు. ఐదవ మూల స్థంభము: రమదాన్ నెల ఉపవాసములు పాటించుట: ఉపవాసము అంటే – అల్లాహ్’ను ఆరాధించే సంకల్పముతో, ఉషోదయం నుండి మొదలుకుని సూర్యాస్తమయం వరకు తినుట, త్రాగుట మరియు ఉపవాసాన్ని భంగపరిచే ప్రతి విషయాన్నుండి దూరంగా ఉండుట.
Hadeeth details

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాసులపై అల్లాహ్ యొక్కహక్కు మరియు అల్లాహ్ పై దాసుల యొక్క హక్కును గురించి వివరిస్తున్నారు. దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే వారు కేవలం ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఎవరినీ, దేనీనీ ఆయనకు సాటి కల్పించరాదు. మరియు అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే ఎవరైతే ‘అల్లాహ్ మాత్రమే ఏకైక నిజ ఆరాధ్యుడు’ అని విశ్వసిస్తారో మరియు ఆయనకు ఎవరినీ సాటి కల్పించరో, అటువంటి వారిని అల్లాహ్ శిక్షించడు. అపుడు ము’ఆద్ రజియల్లాహు అన్హు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ శుభవార్తను ప్రజలకు వినిపించవద్దా. వారు (అల్లాహ్ యొక్క) ఈ అనుగ్రహం పట్ల ఆనంద పడతారు, సంతోషపడతారు” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రజలు కేవలం దీనిపైనే ఎక్కడ ఆధార పడతారోనని భయపడి, ఆయనను వారించారు.
Hadeeth details

ముఆధ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒంటె పై వారి వెనుక కూర్చుని ఉన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఓ ముఆధ్!” అని పిలిచారు. (ఆయన జవాబిచ్చినప్పటికీ) అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు మరల మరల ముఆధ్ రజియల్లాహు అన్హు ను పిలిచారు. ఆయన చెప్పబోయే విషయం ఎంత ముఖ్యమైనదో తెలియజేయడానికి. మూడు సార్లూ కూడా ముఆధ్ రజియల్లాహు అన్హు “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అని సమాధానమిచ్చారు. అంటే దాని అర్థం “మీరు మరలమరల పిలిచినా నేను మరల మరల ఇదే సమాధానం ఇస్తాను, (ఎందుకంటే, ఓ రసూలుల్లాహ్) మీ సేవలో హాజరుగా ఉన్నాను అని సమాధనం ఇవ్వడమే నాకు సంతోషం”. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసారు “ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహ్” అంటే “అల్లాహ్ తప్ప, ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని మరియు మ”ముహమ్మదుర్రసూలుల్లాహ్”, అంటే “ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని సత్యపూర్వకంగా మరియు పూర్తి హృదయంతో, అందులో ఏ మాత్రమూ అసత్యము లేకుండా సాక్ష్యమిస్తాడొ, ఒకవేళ అతడు అదే అవస్థలో (తాను పలికిన సాక్ష్యాన్ని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్న స్థితిలో) చనిపోయినట్లయితే, అతనిపై (అటువంటి వానిపై) అల్లాహ్ నరకాగ్నిని నిషేధించినాడు. అదివిని ముఆధ్ రజియల్లాహు అన్హు తాను ఈ శుభవారను అందరికీ వినిపిస్తానని, అది విని అందరూ మిక్కిలిగా సంతోషపడతారని, అనుమతించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని అడుగుతారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయవద్దని వారించినారు – ప్రజలు ఈ ఒక్క విషయం పైనే ఆధారపడి మిగతా ఆచరణలను తక్కువ చేస్తారనే భయంతో. ముఆధ్ రజియల్లాహు అన్హు ఈ విషయాన్ని తాను చనిపోవడానికి ముందు వరకూ ఎవరికీ తెలియజేయలేదు. ఙ్ఞానమును ఇతరులకు చేరవేయకుండా దాచిపెట్టిన వాడి పాపానికి లోనవుతానేమో అనే భయంతో చనిపోవడానికి ముందు ఆయన ఈ విషయాన్ని అందరికీ తెలియజేసారు.
Hadeeth details

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేస్తున్నారు – ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని నాలుకతో ఉచ్ఛరిస్తూ, సాక్ష్యము పలుకుతాడో, అంటే - అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని సాక్ష్యము పలుకుతాడో, మరియు అల్లాహ్ తప్ప ఆరాధించబడే ప్రతిదానినీ నిరసిస్తాడో (తిరస్కరిస్తాడో), మరియు ఇస్లాం తప్ప మిగతా ఏ ధర్మముతోనూ నాకు సంబంధం లేదు అని నిరాకరిస్తాడో – అపుడు అతని సంపద, మరియు అతని రక్తము మిగతా విశ్వాసుల కొరకు నిషేధమై పోతుంది (హరాం అయిపోతుంది). అది మనది కాదు, మనకు కేవలం అతని బాహ్య ఆచరణలతో మాత్రమే సంబంధం ఉంటుంది. అతని సంపద తీసుకొనబడదు, మరియు అతని రక్తము చిందించబడదు – ఇస్లామీయ చట్ట ప్రకారము అతని సంపదను తీసివేసుకునే, లేక అతని రక్తాన్ని చిందించ వలసి వచ్చే నేరము అతడు చేస్తే తప్ప. తీర్పు దినమున అతని లెక్కా పత్రము అల్లాహ్ తీసుకుంటాడు. అతడు నిజాయితీ పరుడైతే (సద్వర్తనుడైతే) అల్లాహ్ అతనికి ప్రతిఫలాన్నిస్తాడు, ఒకవేళ అతడు కపటుడైతే అల్లాహ్ అతడిని శిక్షిస్తాడు.
Hadeeth details

ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి రెండు లక్షణాలను గురించి అడుగుతాడు – ఒకవేళ అవి గానీ ప్రజలలో ఉంటే, అవి వారిని అనివార్యంగా స్వర్గములోనికి లేదా నరకము లోనికి ప్రవేశింపజేస్తాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు: అనివార్యంగా ఒక వ్యక్తిని స్వర్గములోనికి ప్రవేశింపజేసే ఆ లక్షణం ఏమిటంటే; ఏకైకుడైన అల్లాహ్ కు ఎవరినీ లేక దేనిని సాటి కల్పించకుండా, కేవలం ఆయనను మాత్రమే ఆరాధించే లక్షణం. ఆ లక్షణం కలిగిన వ్యక్తి అదే స్థితిలో మరణించినట్లయితే, అతడు స్వర్గములోనికి అనివార్యంగా ప్రవేశించబడతాడు. అలాగే అనివార్యంగా ఒక వ్యక్తిని నరకములోనికి ప్రవేశింపజేసే ఆ లక్షణం ఏమిటంటే; ఒక వ్యక్తి అల్లాహ్ తో పాటు మరొకరిని కూడా ఆరాధిస్తూ, ఆయన ఏకత్వములో, ఆయన ప్రభుతలో, ఆయన దైవత్వములో, ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఆయన గుణగణాలలో, లక్షణాలలో ఇతరులను భాగస్వాములుగా చేసే లక్షణం. ఎవరైతే అలా చేస్తూ (షిర్క్ చేస్తున్న స్థితిలో) చనిపోతాడో, అతడు అనివార్యంగా నరకం లోనికి ప్రవేశపెట్టబడతాడు.
Hadeeth details

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా తెలుపుతున్నారు: ఎవరైతే అల్లాహ్ కు చెందవలసిన దానిని వేరే ఇంకెవరికైనా అంకితం చేస్తారో, ఉదాహరణకు అల్లాహ్ కు కాకుండా వేరే వారికి దుఆ చేయడం, లేక ఆయనను గాక సహాయం కొరకు (ఆయన స్థానములో) వేరే ఇంకెవరినైనా అర్థిస్తాడో – మరియు అదే విధానం పై మరణిస్తాడు అతడు నరకవాసులలోని వాడు అవుతాడు. అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు దానికి కొనసాగింపుగా ఇలా అన్నారు: “ఎవరైతే ఎవరినీ లేక దేనిని అల్లాహ్ కు సాటి కల్పించకుండా, ఆ స్థితిలోనే మరణిస్తాడో అతని గమ్యస్థానము స్వర్గము.”
Hadeeth details

ముఆద్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ను, ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానించే ఒక దాయీగా, మరియు అక్కడి ప్రజలకు ఇస్లాం విధి విధానాలను నేర్పించే ఒక గురువుగా, యమన్ దేశానికి పంపునపుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు వివరించినారు – నీవు క్రైస్తవులతో ముఖాముఖీ కాబోతున్నావని, వారి కొరకు (అన్ని విధాలా) తయారుగా ఉండాలని, ఇంకా వారికి ధర్మబోధలో భాగంగా అతిముఖ్య విషయాలు బోధించి ఆ తరువాత ముఖ్య విషయాలను బోధించమని వివరించినారు. ధర్మం పరంగా, వారి విశ్వాసాన్ని తీర్చి దిద్దాడానికి, సంస్కరించడానికి అతడు ముందుగా వారిని “అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యం పలుకుట వైపునకు ఆహ్వానిస్తాడు. ఎందుకంటే అలా సాక్ష్యం పలుకుట ద్వారానే వారు ఇస్లాం లోనికి ప్రవేశిస్తారు. ఒకవేళ వారు దానికి సమ్మతించి అనుసరించినట్లయితే, అపుడు వారిని సలాహ్ (నమాజు) స్థాపించమని ఆదేశిస్తాడు. ఎందుకంటే ఒక ముస్లిం కొరకు తౌహీద్ (నిజ ఆరాధ్యుడు కేవలం ఏకైకుడైన అల్లాహ్ మాత్రమే అని విశ్వసించుట) తరువాత అతి ముఖ్యమైనది సలాహ్ యే. ఒకవేళ వారు దానిని స్థాపించినట్లయితే, వారిలోని ధనవంతులను, తమ సంపదలలో నుంచి పేదవారికి జకాత్ చెల్లించమని ఆదేశిస్తాడు. అలాగే జకాతు పేరున సంపదలలో నుండి ఉత్తమమైన వాటిని ఏరి తీసుకో రాదనే హెచ్చరిక కూడా ఉంది. ఎందుకంటే, విధి నిర్వహణ సమతుల్యతతో కూడి ఉంటుంది. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్యాయానికి పాల్బడ వద్దని హితబోధ చేసినారు. అన్యాయానికి పాల్బడినట్లయితే, అలా అన్యాయానికి గురైన వాడు అల్లాహ్ వద్ద మొరపెట్టుకుంటాడు మరియు అతడి మొర స్వీకరించబడుతుంది.
Hadeeth details

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – తీర్పు దినము నాడు తన మధ్యవర్తిత్వాన్ని పొందే వారు ఎవరంటే, ఎవరైతే ‘నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప’ అని చిత్తశుద్ధితో హృదయపూర్వకంగా పలుకుతాడో’. అంటే, ‘కేవలం అల్లాహ్ తప్ప, నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు’ అని పలుకబడే సాక్ష్యం స్వచ్ఛమైనదై ఉండాలి, షిర్క్ (అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పించడం) మరియు కపటత్వముల నుండి విముక్తి అయినదై ఉండాలి.
Hadeeth details

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – విశ్వాసము అనేక శాఖలుగా, అనేక శ్రేణులుగా ఉంటుందని, అది విశ్వాసములు, ఆచరణలు మరియు వాక్కులతో కూడి ఉంటుందని తెలియజేస్తున్నారు. విశ్వాసములలో ఉత్తమ స్థాయి మరియు ఉత్తమ శ్రేణి విశ్వాసము: “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు) అని పలుకుట, దాని అర్థాన్ని, భావాన్ని గ్రహించుట, దానికి అనుగుణంగా ఆచరించుట – అంటే కేవలం అల్లాహ్ మాత్రమే ఏకైక నిజ ఆరాధ్యుడు అని, ఆయన మాత్రమే ఆరాధనలకు అర్హుడు అని, ఆయన తప్ప మరింకెవ్వరూ లేరు అని మనసా, వాచా, కర్మణా తెలుసుకొనుట, గ్రహించుట. మరియు విశ్వాసపు శాఖల ఆచరణలో అత్యంత అల్పమైన (తక్కువ స్థాయి కలిగిన) ఆచరణ ఏమిటంటే, ప్రజలు నడిచే దారిలో వారికి హాని కలిగించే దానిని దారి నుంచి తొలగించుట. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసారు: అణకువ, నమ్రత, బిడియము – విశ్వాసపు లక్షణాలలో ఒకటి అని. అణకువ, నమ్రత, బిడియము – విశ్వాసులలో ఉత్తమమైన ఆచరణలు ఆచరించే, మరియు చెడు ఆచరణలను వదిలి వేసే వైఖరిని, దృక్పథాన్ని ప్రొత్సహిస్తాయి.
Hadeeth details